Sunday, August 14, 2016

క్షీరసాగరమథనం – ఆ పాలవెల్లి

8-289-క.
 పాలవెల్లి కూఁతురు
దీపుల చూపులను దోఁగి తిలకింపఁ బ్రజల్
చేట్టిరి సంపదలనుఁ
బ్రాపించెను మేలు; జగము బ్రతికె నరేంద్రా!
8-290-క.
పాలేటి రాచకన్నియ
మే లారెడు చూపులేక మిడు మిడు కంచున్
జాలిం బురపురఁ బొక్కుచుఁ
దూలిరి రక్కసులు కీడు దోఁచిన నధిపా!

టీకా:
            ఆ = ఆ; పాలవెల్లికూతురున్ = లక్ష్మీదేవి; తీపుల = మాధుర్యముల; చూపులన్ = చూపులందు; తోగి = తడిపి; తిలకింపన్ = చూడగా; ప్రజల్ = లోకులు; చేపట్టిరి = పొందిరి; సంపదలన్ = సంపదలను; ప్రాపించెను = సమకూరెను; మేలు = శుభములు; జగమున్ = భువనములు; బ్రతికెన్ = సుస్థితినిపొందినవి; నరేంద్రా = రాజా.
            పాలేటిరాచకన్నియ = లక్ష్మీదేవి; మేలారెడు = మేలుకలిగించెడి; చూపు = దృష్టి; లేక = లేకపోవుటచేత; మిడుమిడుకు = మిడుకుమిడుకు; అంచున్ = అనుచు; జాలిన్ = విచారముతో; పురపురన్ = పురపురమని; పొక్కుచున్ = దుఃఖించుచు; తూలిరి = చిన్నబోయిరి; రక్కసులున్ = రాక్షసులు; కీడు = అశుభములు; తోచినన్ = ఉదయించగా; అధిపా = రాజా.

భావము:
            పరీక్షిన్మహారాజా! ఆ సముద్రరాజపుత్రి లక్ష్మీదేవి చల్లని చూపులతో తియ్యగా చూసింది. ప్రజలకు సంపదలు చేకూరాయి, శుభాలు సమకూరాయి. జగత్తు సుఖజీవనంతో జీవించింది.
            ఓ రాజా! పరీక్షిత్తూ! క్షీరసాగర రాకుమారి అయిన మహాలక్ష్మి శుభకరమైన చూపులు కరువు అయ్యి రాక్షసులు పరితపించారు. విచారంతో తహ తహ లాడుతూ, జాలితో బుడబుడ దుఃఖించారు. వారికి కీడు తోచి తూలిపోయారు.


No comments: