Friday, December 31, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౭(437)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-933-క.
ధాత్రీవర సమధిక చా
రిత్రుఁడు హలపాణి పలికె ధృతి "నాత్మా వై
పుత్రక నామాసి యను ప
విత్రశ్రుతి వాక్యసరణి విశదం బగుటన్.
10.2-934-క.
ఈ సూతసూనుఁ డిపుడు మ
హాసత్త్వము నాయువును ననామయమును వి
ద్యా సామర్థ్యము గలిగి సు
ధీసత్తములార! యీక్షితిన్ విలసిల్లున్."
10.2-935-వ.
అని సూతుం బునర్జీవితుంగాఁ జేసి మునులం జూచి యిట్లనియె. 

భావము:
ఓ రాజా! “ఆత్మా వైపుత్ర నామాసి”, (తానే పుత్రరూపంలో తిరిగి జన్మిస్తాడు) అనే వేదవచనానికి తగినట్లు మహానుభావుడైన బలరాముడు ఇలా అన్నాడు. “ఓ మహర్షులారా! ఇప్పుడు ఈ సూతుని కుమారుడు ఆయువు, ఆత్మశక్తి, రోగం లేని తనువు, విద్యాదక్షత పొంది ఈ లోకంలో విరాజిల్లుతాడు.” ఇలా అనుగ్రహించి బలరాముడు, సూతుడిని బ్రతికించి మునులతో మరల ఇలా అన్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=68&Padyam=934 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: