Thursday, December 9, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౯(419)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-893-క.
హాహా యని భూతావళి
హాహాకారములు సేయ నంతట దేఱ
న్నాహరిఁ గనుఁగొని యతఁ డు
త్సాహంబునఁ బలికె బాహుశౌర్యస్ఫూర్తిన్.
10.2-894-చ.
"నళినదళాక్ష! మత్సఖుఁడు నాఁ దగు చైద్యుఁడు గోరినట్టి కో
మలి నవినీతిమైఁ దగవుమాలి వరించితి; వంతఁ బోక దో
ర్బలమున ధర్మనందును సభాస్థలి నేమఱి యున్న వాని న
చ్చలమునఁ జంపి తట్టి కలుషంబున నేఁడు రణాంగణంబునన్. 

భావము:
సకల భూతాలు హాహాకారాలు చేసాయి. అ సమయంలో రథంలోని కృష్ణుడు తెప్పరిల్లడం చూసి, బాహుబలశాలి సాల్వుడు ఉత్సాహంతో ఇలా అన్నాడు. “ఓ పద్మాక్షా! కృష్ణా! నా మిత్రుడు నా వాడు అయిన చైద్యరాజు శిశుపాలుడు కోరుకున్న కన్యకను నీవు నీతిహీనుడవు అయి పరిగ్రహించావు. అది చాలక ధర్మరాజు యాగ సభలో ఏమరుపాటుగా ఉన్న అతడిని పగబట్టి చంపావు. అంతటి తప్పుచేసిన నీవు ఇప్పుడు రణరంగంలో.. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=894 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: