Thursday, December 16, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౬(426)

( సాల్వుని వధించుట) 

10.2-910-వ.
అట్లు కృష్ణుం డమ్మయనిర్మిత మాయావిమానంబు నిజగదాహతి నింతింతలు తునియలై సముద్రమధ్యంబునం దొరంగం జేసిన సాల్వుండు గోఱలు వెఱికిన భుజంగంబు భంగి గండడంగి విన్ననై విగతమాయాబలుం డయ్యునుఁ బొలివోవని బీరంబున వసుధా తలంబునకు డిగ్గి యాగ్రహంబున.
10.2-911-క.
కరమునఁ బవినిభ మగు భీ
కర గద ధరియించి కదియఁగాఁ జనుదేరన్
మురహరుఁ డుద్ధతి సాల్వుని
కరము గదాయుక్తముగను ఖండించె నృపా! 

భావము:
ఆ విధంగా మయడు నిర్మించిన మాయావిమానాన్ని శ్రీకృష్ణుడు తన గదాఘాతంతో ముక్కలు చేసి సముద్రమధ్యంలో పడేలా చేసాడు. అప్పుడు సాల్వుడు కోరలు తీసిన క్రూరసర్పంలా దీనుడై మాయాబలం నశించి కూడ, మొక్కపోని పరాక్రమంతో భూమికి దిగాడు. ఓ రాజా నరేంద్రా! సాల్వుడు వజ్రాయుధంతో సమానమైన భయంకర గదను చేతబట్టి కృష్ణుడిని ఎదుర్కొన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఆ గదతో సహితంగా వాడి చేతిని ఖండించివేసాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=66&Padyam=911 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: