Wednesday, July 15, 2020

ఉషా పరిణయం - 45

( శివ కృష్ణులకు యుద్ధ మగుట )

10.2-422-తే.
ప్రళయ జీమూత సంఘాత భయద భూరి
భైరవారావముగ నొత్తెఁ బాంచజన్య
మఖిలజనులు భయభ్రాంతులయి చలింపఁ
గడఁగి నిర్భిన్న రాక్షసీగర్భముగను.
10.2-423-వ.
అట్టి యవక్ర విక్రమ పరాక్రమంబునకు నెగడుపడి బాణుండు లేటమొగంబు వడి చేయునదిలేక విన్ననయి యున్నయెడ.

భావము:
అలా చేసిన శ్రీకృష్ణుడు, ప్రళయకాలం నాటి మేఘగర్జనం అంత గట్టిగా తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. ఆ శంఖారావం వినిన సమస్త జనులు భయభ్రాంతులు అయ్యారు. రాక్షస స్త్రీల గర్భాలు భేదిల్లాయి. శ్రీకృష్ణుని భయంకర పరాక్రమానికి దైన్యము చెంది, బాణాసురుడు ఏమీచేయలేక చిన్నబోయి ఉండగా.....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=37&padyam=423

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 


No comments: