Friday, October 23, 2015

కాళియ మర్దన - గోవర్గముతో

10.1-695-వ.
అని విన్నవించిన కాళియు పలుకులు విననవధరించి కారుణ్యమానసుండైన సర్వేశ్వరుం డతని కిట్లనియె
10.1-696-క.
గోవర్గముతో మనుజులు
ద్రావుదు రీ మడుఁగు నీరుఁ; దగ దిం దుండన్;
నీవును నీ బాంధవులును
నీ వనితలు సుతులుఁ జనుఁడు నేఁ డంబుధికిన్.
అని = అని; విన్నవించినన్ = మనవిచేసుకొన్న; కాళియు = కాళియుని యొక్క; పలుకులు = మాటలు; వినన్ = అంగీకరించుటకు; అవధరించి = గ్రహించి; కారుణ్య = దయగల; మానసుండు = మనసుగలవాడు; ఐన = అయిన; సర్వేశ్వరుండు = కృష్ణుడు; అతని = అతని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
గో = ఆవుల; వర్గము = సమూహము; తోన్ = తోపాటు; మనుజులు = మానవులు; త్రావుదురు = తాగెదరు; ఈ = ఈ; మడుగు = మడుగులోని; నీరున్ = నీటిని; తగదు = యుక్తముకాదు; ఇందున్ = ఈ మడుగునందు; ఉండన్ = ఉండుట; నీవును = నీవు; నీ = నీ యొక్క; బాంధవులును = చుట్టాలు; నీ = నీ యొక్క; వనితలు = స్త్రీలు; సుతులు = పిల్లలు; చనుడు = వెళ్ళండి; నేడు = ఇవాళ; అంబుధి = సముద్రమున {అంబుధి - అందు (నీటికి) నిధి, కడలి}; కిన్ = కు.
१०.१-६९५-व.
अनि विन्नविंचिन काळियु पलुकुलु विननवधरिंचि कारुण्यमानसुंडैन सर्वेश्वरुं डतनि किट्लनिये
१०.१-६९६-क.
गोवर्गमुतो मनुजुलु
द्रावुदु री मडुँगु नीरुँ; दग दिं दुंडन्;
नीवुनु नी बांधवुलुनु
नी वनितलु सुतुलुँ जनुँडु नेँ डंबुधिकिन्.
ఈ విధంగా మనవి చేసుకొన్న కాళియుడి మాటలు విని మన్నించ దలచుకొన్న దయాస్వభావి, సర్వేశ్వరుడు అయిన కృష్ణుడు అతనిని ఇలా ఆఙ్ఞాపించాడు.
“కాళియుడా! ఈ మడుగులోని నీటిని గోవులతో పాటు మనుషులు కూడా తాగుతారు. కనుక, ఇంక నువ్వు ఇక్కడ ఉండ కూడదు. నువ్వు, నీ పెళ్ళం పిల్లలు, బంధువులు అందరితో కలిసి ఇవాళే సముద్రం లోకి వెళ్ళిపోండి.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=83
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: 

No comments: