Thursday, January 6, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౪౨(442)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-946-తే.
అంత నభిషిక్తుఁ జేసి యత్యంత సురభి
మంజులామ్లాన కంజాత మాలికయును
నంచితాభరణములు దివ్యాంబరములు
నర్థి నిచ్చినఁ దాల్చి యా హలధరుండు.
10.2-947-క.
దేవేంద్రుఁ బోలి యొప్పెను
ధీవిలసితుఁ డగుచు మునితతిన్ వీడ్కొని తన్
సేవించుచుఁ గతిపయ వి
ప్రావలి సనుదేరఁ గౌశికాఖ్యంబునకున్. 

భావము:
మునులు బలరాముడిని పవిత్ర తీర్ధజలాలతో అభిషిక్తుణ్ణి చేసారు. సుగంధాలు విరజిమ్మే సుందర సుకుమార పద్మమాలికతో అలంకరించారు. చక్కని ఆభరణాలనూ ప్రశస్తములైన వస్త్రాలనూ ప్రీతితో ఇచ్చారు బలరాముడు వాటిని ధరించాడు. ఆ ప్రతిభావంతుడైన బలరాముడు అనంతరం దేవేంద్రుడిలా ప్రకాశిస్తూ మునులవద్ద వీడ్కొని బ్రాహ్మణులు కొందరు వెంటరాగా కౌశికి అనే నదికి వెళ్ళి.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=69&Padyam=947 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


No comments: