Monday, March 27, 2017

మత్స్యావతార కథ - 14:

8-715-ఆ.
అలసి సొలసి నిదుర నందిన పరమేష్ఠి
ముఖము నందు వెడలె మొదలి శ్రుతులు
నపహరించె నొక హయగ్రీవుఁ డను దైత్య
భటుఁడు; దొంగఁ దొడర బరుల వశమె?
8-716-క.
చదువులుఁ దన చేఁ బడినం
జదువుచుఁ బెన్ బయల నుండ శంకించి వడిం
జదువుల ముదుకఁడు గూరుకఁ
జదువుల తస్కరుఁడు చొచ్చె జలనిధి కడుపున్.

భావము:
అలా బాగా అలసిపోయిన బ్రహ్మదేవుడు నిద్రపోయాడు. అతని ముఖాలనుండి వేదాలు వెలువడినాయి. హయగ్రీవుడు అనే రాక్షసవీరుడు వాటిని దొంగిలించాడు. ఆ హయగ్రీవుడికి తప్ప అలా దొంగతనం చేయడం ఇతరులకు సాధ్యం కాదు. అలా వేదాలను చెరపట్టిన హయగ్రీవుడు వాటిని చదువసాగాడు. బయటి ప్రపంచంలో ఉండటానికి భయపడిన అతడు బ్రహ్మదేవుడు నిద్రలో ఉండటం గమనించి, వేగంగా సమద్రంలోకి వెళ్ళిపోయాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=88&padyam=716

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: