Sunday, March 12, 2017

కాళియమర్దనము – గోవర్గముతో

:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:

10.1-695-వ.
అని విన్నవించిన కాళియు పలుకులు విన నవధరించి కారుణ్యమానసుం డైన సర్వేశ్వరుం డతని కిట్లనియె
10.1-696-క.
గోర్గముతో మనుజులు
ద్రావుదు రీ మడుఁగు నీరుఁగ దిం దుండన్;
నీవును నీ బాంధవులును
నీ నితలు సుతులుఁ జనుఁడు నేఁ డంబుధికిన్.

టీకా:
అని = అని; విన్నవించినన్ = మనవిచేసుకొన్న; కాళియు = కాళియుని యొక్క; పలుకులు = మాటలు; వినన్ = అంగీకరించుటకు; అవధరించి = గ్రహించి; కారుణ్య = దయగల; మానసుండు = మనసుగలవాడు; ఐన = అయిన; సర్వేశ్వరుండు = కృష్ణుడు; అతని = అతని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
గో = ఆవుల; వర్గము = సమూహము; తోన్ = తోపాటు; మనుజులు = మానవులు; త్రావుదురు = తాగెదరు; ఈ = ఈ; మడుగు = మడుగులోని; నీరున్ = నీటిని; తగదు = యుక్తముకాదు; ఇందున్ = ఈ మడుగునందు; ఉండన్ = ఉండుట; నీవును = నీవు; నీ = నీ యొక్క; బాంధవులును = చుట్టాలు; నీ = నీ యొక్క; వనితలు = స్త్రీలు; సుతులు = పిల్లలు; చనుడు = వెళ్ళండి; నేడు = ఇవాళ; అంబుధి = సముద్రమున {అంబుధి - అందు (నీటికి) నిధి, కడలి}; కిన్ = కు.

భావము:
ఈ విధంగా మనవి చేసుకొన్న కాళియుడి మాటలు విని మన్నించ దలచుకొన్న దయాస్వభావి, సర్వేశ్వరుడు అయిన కృష్ణుడు అతనిని ఇలా ఆఙ్ఞాపించాడు.
 “కాళియుడా! ఈ మడుగులోని నీటిని గోవులతో పాటు మనుషులు కూడా తాగుతారు. కనుక, ఇంక నువ్వు ఇక్కడ ఉండ కూడదు. నువ్వు, నీ పెళ్ళం పిల్లలు, బంధువులు అందరితో కలిసి ఇవాళే సముద్రం లోకి వెళ్ళిపోండి.

No comments: