Sunday, August 29, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౨౩(323)

( ధర్మజు రాజసూయారంభంబు )

10.2-658-తే.
"ఇప్పు డెందుండి వచ్చితి విందులకును?
నఖిలలోకైకసంచారి వగుటఁ జేసి
నీ యెఱుంగని యర్థంబు నిఖిలమందు
నరయ లేదండ్రు; మిమ్మొకఁ టడుగవలయు.
10.2-659-తే.
పాండునందను లిప్పు డే పగిది నెచట
నున్నవారలొ యెఱిఁగింపు" మన్న మౌని
కరసరోజాతములు మోడ్చి కడఁకతోడఁ
బలికెఁ గమలాక్షుఁ జూచి సద్భక్తి మెఱసి.

భావము:
"ఓ మునీంద్రా! నారదా! ఎక్కడనుండి ఇక్కడికి విచ్చేశారు. సకల లోకాలలోనూ సంచరించే మీకు తెలియని విషయము ఏదీ ఉండదు. మిమ్మల్ని ఒక సంగతి అడగాలి. పాండవులు ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారో తెల్పండి” అని శ్రీకృష్ణుడు అడిగాడు. నారదుడు చేతులు జోడించి భక్తితో ఇలా విన్నవించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=659

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: