Tuesday, July 13, 2021

శ్రీకృష్ణ విజయము - 280

( రుక్మిబలరాముల జూదంబు )

10.2-309-క.
అందు వసించిరి నందిత
చందన మందార కుంద చంద్ర లసన్మా
కందముల నీడ హృదయా
నందము సంధిల్ల నందనందనముఖ్యుల్‌.
10.2-310-వ.
తదనంతరంబ పురప్రవేశంబు సేసి" రని చెప్పి శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె.

భావము:
అలా చందనవృక్షాలు మందారాలు మంచి మామిళ్ళు మొదలైన అనేక వృక్షాలతో శోభిస్తున్న ఆ కుశస్థలి పట్టణం సమీపంలోని ఉద్యానవనం చేరి విడిసారు. అక్కడ కృష్ణాదులు చందన మందారాది ఉద్యానవన వృక్షాల నీడలలో ఆనందంగా విశ్రమించారు. అటుపిమ్మట, వారందరూ పురప్రవేశం చేశారు.” అని చెప్పి శుకయోగీంద్రుడు పరీక్షిన్మహారాజుతో ఇలా చెప్పసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=30&Padyam=309

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: