Tuesday, May 31, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౫౫(555)

( సుభద్రా పరిణయంబు ) 

10.2-1167-క.
రాముఁడు తత్కపటాకృతిఁ
దా మదిఁ దెలియంగలేక దగ నొకనాఁ డా
భూమీవర తాపసుఁ బో
రామింగని యాత్మమందిరమునకుఁ దెచ్చెన్.
10.2-1168-ఆ.
తెచ్చి భిక్షసేయ దేవేంద్రతనయుండు
గుడుచుచుండి యచటఁ గోరి మెలఁగు
నసమబాణు మోహనాస్త్రంబుకైవడి
వీరమోహి నన విహారలీల.
10.2-1169-వ.
అట్లు సుభద్ర విహరించుచున్న సమయంబున.

భావము:
రాజా! బలరాముడికి అర్జునుడి కపట వేషం విషయం తెలియలేదు. అతడు సన్యాసిగా మెలగుచున్న ఆ అర్జునుణ్ణి చూసి తన మందిరానికి తీసుకుని వచ్చాడు. అలా బలరాముడు భక్తితో కపటసన్యాసి ఐన అర్జునునికి భిక్ష సమర్పించడం కోసం ఆహ్వానించి అర్చించాడు. ఆ మాయాతాపసి అక్కడే ఆరగిస్తూ ఉన్నాడు. అర్జునుని సమక్షంలో మన్మథుని సమ్మోహనాస్త్రంలా ఉన్న సుభద్ర కోరి విహరిస్తున్నది. ఆలాగున సుభద్ర అతని సమీపంలో సంచరిస్తున్న సమయంలో...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=81&Padyam=1168

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

No comments: