Monday, May 9, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౩౬(536)

( వసుదేవుని గ్రతువు ) 

10.2-1132-చ.
జలరుహలోచనాది యదుసత్తము లందఱు నన్నిభంగులం
గలిత విభూషణాంబర నికాయము లిచ్చి బహూకరించి వీ
డ్కొలిపిన నందముఖ్యులు ముకుందపదాబ్జ మరందపాన స
ల్లలిత నిజాత్మ షట్పదములన్ మరలించుచు నెట్టకేలకున్.
10.2-1133-వ.
చనిచని.

భావము:
తరువాత పద్మాక్షుడు శ్రీకృష్ణుడు తక్కిన యాదవ ప్రముఖులు అందరు నందుడికి అతడి పరివారానికి తగిన ఆభరణాలు వస్త్రాలు సర్వం బహుకరించి వీడ్కోలు పలికారు. ముకుందుని చరణారవింద మకరంద పానంతో మత్తిల్లిన చిత్తాలనే తుమ్మెదలను బలవంతంగా మరలించుకుని నందుడు మొదలైనవారు ప్రయాణం సాగించారు. అలా ప్రయాణమైన నందాదులు....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=79&Padyam=1132

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: