Monday, May 9, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౩౭(537)

( వసుదేవుని గ్రతువు ) 

10.2-1134-ఆ.
మరలి మరలి "కృష్ణ! మాధవ! గోవింద!
పద్మనాభ! భక్త పారిజాత!
దేవదేవ!" యనుచుఁ దివిరి చూచుచు మధు
రాభిముఖులు నగుచు నరిగి రంత.
10.2-1135-క.
క్రమమున నచ్చటఁ బ్రావృ
ట్సమయం బగుటయును బంధుజన యాదవ వ
ర్గము లోలిఁ గొలువ సురగణ
నమితులు బలకృష్ణు లాత్మనగరంబునకున్.
10.2-1136-వ.
వచ్చి సుఖంబుండు నంత.

భావము:
కృష్ణ! మాధవ! గోవింద! పద్మనాభ! భక్తపారిజాతమా! దేవాధిదేవా! అనుకుంటూ శ్రీకృష్ణనామాలు జపిస్తూ మాటిమాటికీ వెనుతిరిగి చూస్తూ, పోలేక పోలేక నందుడూ అతని అనుచరులూ మధురానగరం వైపు సాగిపోయారు. ఇలా శ్యమంతకపంచకంలో ఉండగా వర్షాకాలం వచ్చింది. బంధువులు పరివారం సేవిస్తూ ఉండగా, దేవతలచే సైతము కొలువబడువారు అయిన బలరామకృష్ణులు తమ ద్వారకానగరం చేరుకున్నారు. అంతట అందరూ ద్వారక చేరి సుఖంగా కాలం గడుపుతున్న సమయంలో....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=79&Padyam=1135

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments: