Monday, May 23, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౪౯(549)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1157-క.
వీరలఁ దోకొని యిపుడే
ధారుణికిన్నేగి జనని తాపము వాపన్
వీరలు నంతట శాపముఁ
దీఱి మదీయప్రసాదధీయుతు లగుచున్.
10.2-1158-క.
పొలుపుగ సుగతిం బొందఁగఁ
గల" రని హరి యానతిచ్చి కరుణాన్వితుఁడై
బలిచే ననుమతిఁ గొని వా
రలఁ దోకొని వచ్చె నిద్ధరామండలికిన్.

భావము:
వీరిని తీసుకు వెళ్ళి భూలోకంలోఉన్న మా తల్లి శోకాన్నిపోగొడతాము. అంతటితో వీరు శాపవిముక్తులు కాగలరు; మా అనుగ్రహం వలన దివ్యజ్ఞానం కలవారు కాగలరు. తదుపరి, నా అనుగ్రహం వలన వీరికి సుగతి ప్రాప్తిస్తుంది.” ఈవిధంగా పలికి కరుణామయుడైన కృష్ణుడు బలిచక్రవర్తి అనుమతి పొంది భూలోకానికి దేవకీతనయులను తమ కూడా తీసుకుని వచ్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1158

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments: