Friday, May 27, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౫౨(552)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1163-క.
చచ్చిన బాలురఁ గ్రమ్మఱఁ
దెచ్చుట గడుఁ జిత్ర మనుచు దేవకి మదిలో
నచ్చెరువడి యిది యంతయు
నచ్చపు హరిమాయ గాక! యని తలఁచె నృపా!
10.2-1164-క.
పరమాత్ముఁ డఖిల జగదీ
శ్వరుఁడగు కృష్ణుండు సేయు సత్కృత్యంబుల్‌
పరికింప నెన్నఁ బెక్కులు
ధరణీవర!" యనిన రాజు తా ముని కనియెన్.

భావము:
ఓ రాజా! అలా మరణించిన పుత్రులను మళ్ళీ తీసుకురావడం బాగా చిత్రమని ఆశ్చర్యపడిన దేవకీదేవి, ఇదంతా శ్రీకృష్ణుని మాయా మహత్వమే తప్ప ఇతరం కాదు అని అనుకుంది. ఓ మహారాజా! పరమాత్ముడు, లోకాధినాథుడు అయిన శ్రీకృష్ణుడు చేసిన సత్కార్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.” అని శుకమహర్షి తెలుపగా, ఆయనతో పరీక్షిత్తు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1164

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

No comments: