Friday, November 5, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౮౮(388)

( ధర్మరాజాదుల అవబృథంబు ) 

10.2-816-ఆ.
రాజసూయమఖ వరప్రభావమునకు
నఖిలజనులు మోదమంది రపుడు
కలుషమానసుండు కులపాంసనుఁడు సుయో
ధనుఁ డొకండు దక్క ధరణినాథ! "
10.2-817-వ.
అనిన విని శుకయోగీంద్రునకుఁ బరీక్షిన్నరేంద్రుం డిట్లనియె.
10.2-818-ఆ.
"అఖిల జనుల కెల్ల నానందజనకమై
యెనయు మఖము కురుకులేశ్వరునకుఁ
గర మసహ్యమైన కారణ మెయ్యది
యెఱుఁగఁ బలుకు నాకు నిద్ధచరిత! " 

భావము:
ఓ రాజా పరీక్షిత్తూ! కల్మషచిత్తుడు, వంశనాశకుడు అయిన దుర్యోధనుడు తప్పించి, తక్కిన సమస్త ప్రజలూ రాజసూయయాగ వైభవానికి సంతోషించారు.” అని చెప్పగా విని పరీక్షిత్తు శుకమునీంద్రునితో ఇలా అన్నాడు. “ఓ మహానుభావ! అందరికీ సంతోషాన్ని కలిగించే రాజసూయ యాగం దుర్యోధనుడికి ఎందుకని సహింపరానిది అయిందో నాకు వివరంగా చెప్పు.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=61&Padyam=818 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments: