Thursday, September 22, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౩౫(635)

( మృత విప్రసుతులఁదెచ్చుట ) 

10.2-1316-క.
అని "యా డింభకులను దో
కొని పొం" డని యిచ్చి వీడుకొలిపిన వారల్‌
వినతు లయి పెక్కు విధముల
వినుతించుచు నచటు వాసి విప్రునిసుతులన్.
10.2-1317-వ.
తోడ్కొని సంప్రాప్త మనోరథు లయి య బ్బాలకులఁ ద త్తద్వయో రూపంబులతోడఁ దెచ్చి యాబ్రాహ్మణునకు సమర్పించిన నతండు సంతుష్టాంతరంగుం డయ్యె; న య్యవసరంబున.

భావము:
అని పిమ్మట “ఈ బాలకులను మీరు తీసుకుని వెళ్ళండి” అని పలికి ఆ బాలకులను అప్పజెప్పి విష్ణువు వారికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. శ్రీకృష్ణార్జునులు వినయంతో భగవంతుడిని అనేక విధాల స్తుతిస్తూ బ్రాహ్మణపుత్రులతో అక్కడ నుండి బయలుదేరారు. కోరిన పని సాధించి సఫల మనోరథులు అయిన కృష్ణార్జునులు వారి వారి వయసులకు తగిన ఆకారాలతో ఉన్న ఆ విప్రసుతులను వెంటబెట్టుకుని వచ్చి బ్రాహ్మణుడికి అప్పజెప్పారు. ఆ బిడ్డలను చూసిన ఆ విప్రుడు ఎంతో ఆనందం పొందాడు. అంతట....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1317

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: