Friday, September 16, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౨౭(627)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1302-చ.
నర సుర యక్ష కింపురుష నాగ నిశాచర సిద్ధ సాధ్య ఖే
చర విహగేంద్ర గుహ్యక పిశాచ నివాసములందు రోసి భూ
సురసుత లేగినట్టి గతి సొప్పడకుండుటఁ జూచి క్రమ్మఱన్
ధరణికి నేగుదెంచి బెడిదంబుగ నగ్ని సొరంగఁ బూనినన్.
10.2-1303-వ.
అవ్విధంబంతయు నెఱింగి యమ్మురాంతకుండు “విప్రనందనుల నీకుం జూపెద” నని యనలంబు సొరకుండ నతని నివారించి యప్పుడు.

భావము:
దేవ, యక్ష, కింపురుష, నాగ, రాక్షస, సిద్ధ, సాధ్య, ఖేచరాదుల ఇళ్ళకు వెళ్ళి బ్రాహ్మణపుత్రుల కోసం వెదికాడు. కాని వారి జాడ అక్కడ కూడా దొరకలేదు. చివరకు మళ్ళీ భూలోకానికి వచ్చాడు. తన ప్రతిజ్ఞ ప్రకారం అగ్నిప్రవేశం చేయటానికి పట్టుదలగా సిద్ధపడ్డాడు. శ్రీకృష్ణుడు ఈ విషయం తెలుసుకుని “బ్రాహ్మణ కుమారులను నేను నీకు చూపిస్తాను.” అని చెప్పి అర్జునుడిని మంటల్లో దూకకుండా వారించాడు. పిమ్మట...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1302

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: