Friday, September 16, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౨౬(626)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1299-క.
అని తను నోడక నిందిం
చిన విని యయ్యర్జునుండు చిడిముడిపడుచుం
దన విద్యమహిమ పెంపునఁ
జనియెన్ వెస దండపాణి సదనంబునకున్.
10.2-1300-క.
చని యందు ధారుణీసుర
తనయులు లేకుంటఁ దెలిసి తడయక యింద్రా
గ్ని నిరృతి వరుణ సమీరణ
ధనదేశానాలయములు దగఁ బరికించెన్.
10.2-1301-వ.
వెండియు.

భావము:
ఈలాగున బ్రాహ్మణుడు తనను నిందిస్తుంటే, కోపిం వచ్చిన అర్జునుడు తన విద్యాప్రభావంతో వెంటనే బయలుదేరి యమమందిరానికి వెళ్ళాడు. అక్కడ బ్రాహ్మణపుత్రులు లేకపోడంతో పార్థుడు వెంటనే ఇంద్ర, అగ్ని, నిరృతి, వరుణ, వాయు, కుబేర, ఈశానుల నివాసాలకు వెళ్ళి అన్వేషించాడు. అనంతరం.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1300

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: