Tuesday, June 14, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౬(566)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1184-వ.
ఇట్లు సమర్పించి, యనంతరంబ యమ్మిథిలేశ్వరుండైన జనకుండు పరమానందంబును బొంది.
10.2-1185-చ.
హరిపదపద్మయుగ్మము నిజాంకతలంబునఁ జేర్చి యొత్తుచుం
"బురుషవరేణ్య! యీ నిఖిలభూతగణావలి యాత్మలందు సు
స్థిరమతిఁ గర్మసాక్షివి సుధీవర! నీ పదభక్తకోటితో
నరయ నుమాధినాథ చతురాస్యులుఁ బోలరటందు వెప్పుడున్.

భావము:
ఈవిధంగా కృష్ణాదులను పరమానందంగా గౌరవించి మిథిలానాథుడైన ఆ జనకచక్రవర్తి కృష్ణుని పాదాలను తన ఒడిలో ఉంచుకుని మెత్తగా ఒత్తుతూ అతనితో ఇలా అన్నాడు. “పురుషోత్తమా! జ్ఞాన స్వరూప! సమస్త ప్రాణుల ఆత్మల్లో కర్మసాక్షివై నీవు ఉంటావు. పార్వతీదేవి భర్త శంకరుడు, చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు వంటివారు అయినా నీ భక్తులకు సాటిరారని నీవంటూ ఉంటావు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1185

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

No comments: