Monday, June 6, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౦(560)

( సుభద్రా పరిణయంబు ) 

10.2-1175-క.
కరులం దేరుల నుత్తమ
హరులన్ మణి హేమభూషణాంబరభృత్యో
త్కర దాసికాజనంబుల
నరణంబుగ నిచ్చి పంపె ననుజకుఁ బ్రీతిన్.
10.2-1176-వ.
ఇట్లు కృష్ణున కభిమతంబుగా నర్జునసుభద్రల కరణంబిచ్చి పంపె" నని చెప్పి శుకయోగీంద్రుండు మఱియు నిట్లనియె.

భావము:
ప్రీతిగా బలరాముడు అరణంగా ఏనుగులు, రథాలు, మేలుజాతి అశ్వాలు, వస్త్రాలు, రత్నాభరణాలు, బంగారు భూషణాలు, దాసదాసీజనాలు సుభద్రకు పంపాడు. ఈ విధంగా బలరాముడు శ్రీకృష్ణుని అభిలాష ప్రకారం సుభద్రార్జునులకు అరణం ఇచ్చి పంపాడు.” అని చెప్పి శుకమహర్షి పరీక్షుత్తుతో మరల ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=81&Padyam=1175

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

No comments: