Monday, June 13, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౫(565)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1182-చ.
తిరముగ వారి యిష్టములుదీర్పఁ దలంచి మురాసురారి యొం
డొరుల కెఱుంగకుండ మునియూథముఁదానును నేఁగె వారి మం
దిరముల కేకకాలమున ధీరత నా ధరణీవరుండు వా
రిరుహదళాయతాక్షు మునిబృందములం గనకాసనంబులన్.
10.2-1183-సీ.
కూర్చుండ నియమించి, కొమరారు కాంచన-
  కలధౌత కలశోదకములచేతఁ
బాదముల్‌ గడిగి, తత్పావనజలములు-
  దానును సతియు బాంధవజనంబుఁ
గర మర్థి నిజమస్తకంబుల ధరియించి,-
  వివిధార్చనములు సద్విధి నొనర్చి,
మణిభూషణాంబర మాల్యానులేపన-
  రాజిత ధూప నీరాజనములు
10.2-1183.1-తే.
భక్తిఁ గావించి, పరిమృష్ట బహు విధాన్న
పాయసాపూప పరిపక్వఫలము లోలి
నారగింపఁగఁ జేసి, కర్పూరమిళిత
లలిత తాంబూలములు నెయ్య మలర నొసఁగె.

భావము:
శ్రీకృష్ణుడు వారి కోరిక నెరవేర్చాలనుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరి ఇంటికి మునులతో ఒకే సమయంలో వెళ్ళాడు. బహుళాశ్వుడు కృష్ణుడిని మునిసమూహాన్ని కనకాసనాలపై కూర్చుండబెట్టాడు. బంగారు ఆసనాలపై కూర్చుండ జేసి, బహుళాశ్వుడు బంగారు వెండి కలశాలలోని జలాలతో వారి పాదాలను కడిగాడు. తానూ తన భార్యా బంధువులూ ఆ పవిత్ర తీర్థాన్ని భక్తితో తమ శిరములపై జల్లుకున్నారు. బహుళాశ్వుడు వారిని శాస్త్రోక్తంగా పూజలు సత్కారాలు చేసాడు. మణిభూషణాలూ వస్త్రాలూ పూలదండలూ సుగంధలేపనాలూ వారికి సమర్పించాడు. భక్తితో హారతు లిచ్చాడు. తరువాత షడ్రసోపేతంగా భోజనంపెట్టి మధురఫలాలను అర్పించి పచ్చకర్పూరంతో కూడిన తాంబూలాన్ని ప్రేమతో ఇచ్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1183

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  శ్రీకృష్ణ విజయము - ౫౬౫(565)
( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1182-చ.
తిరముగ వారి యిష్టములుదీర్పఁ దలంచి మురాసురారి యొం
డొరుల కెఱుంగకుండ మునియూథముఁదానును నేఁగె వారి మం
దిరముల కేకకాలమున ధీరత నా ధరణీవరుండు వా
రిరుహదళాయతాక్షు మునిబృందములం గనకాసనంబులన్.
10.2-1183-సీ.
కూర్చుండ నియమించి, కొమరారు కాంచన-
  కలధౌత కలశోదకములచేతఁ
బాదముల్‌ గడిగి, తత్పావనజలములు-
  దానును సతియు బాంధవజనంబుఁ
గర మర్థి నిజమస్తకంబుల ధరియించి,-
  వివిధార్చనములు సద్విధి నొనర్చి,
మణిభూషణాంబర మాల్యానులేపన-
  రాజిత ధూప నీరాజనములు
10.2-1183.1-తే.
భక్తిఁ గావించి, పరిమృష్ట బహు విధాన్న
పాయసాపూప పరిపక్వఫలము లోలి
నారగింపఁగఁ జేసి, కర్పూరమిళిత
లలిత తాంబూలములు నెయ్య మలర నొసఁగె.

భావము:
శ్రీకృష్ణుడు వారి కోరిక నెరవేర్చాలనుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరి ఇంటికి మునులతో ఒకే సమయంలో వెళ్ళాడు. బహుళాశ్వుడు కృష్ణుడిని మునిసమూహాన్ని కనకాసనాలపై కూర్చుండబెట్టాడు. బంగారు ఆసనాలపై కూర్చుండ జేసి, బహుళాశ్వుడు బంగారు వెండి కలశాలలోని జలాలతో వారి పాదాలను కడిగాడు. తానూ తన భార్యా బంధువులూ ఆ పవిత్ర తీర్థాన్ని భక్తితో తమ శిరములపై జల్లుకున్నారు. బహుళాశ్వుడు వారిని శాస్త్రోక్తంగా పూజలు సత్కారాలు చేసాడు. మణిభూషణాలూ వస్త్రాలూ పూలదండలూ సుగంధలేపనాలూ వారికి సమర్పించాడు. భక్తితో హారతు లిచ్చాడు. తరువాత షడ్రసోపేతంగా భోజనంపెట్టి మధురఫలాలను అర్పించి పచ్చకర్పూరంతో కూడిన తాంబూలాన్ని ప్రేమతో ఇచ్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1183

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

No comments: