Monday, March 7, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౯౩(493)

( శమంతకపంచకమున కరుగుట ) 

10.2-1049-మ.
నిరయస్వర్గము లాత్మఁ గైకొనక తా నిర్వాణమూర్తైన యీ
హరిఁ జూడన్, హరితోడఁ బల్క, హరిమే నంటన్, హరిం బాడఁగా
హరితో నేఁగ, సహాసనాస్తరణ శయ్యావాసులై యుండఁగన్
హరి బంధుత్వసఖిత్వముల్ గలుగు భాగ్యం బెట్లు సిద్ధించెనో?"
10.2-1050-తే.
అనుచు యాదవ వృష్ణి భోజాంధకులును
హరిదయాలబ్ధనిఖిలార్థు లగుచు నున్న
మనికిఁ దమ చిత్తములఁ బలుమాఱుఁ బొగడి
పరిణమించిరి; యంత న ప్పాండుమహిషి. 

భావము:
ఈ యాదవ పుంగవులు స్వర్గ నరకాలను లెక్కచేయక, ఈలాగున కృష్ణుడిని చూస్తూ; కృష్ణుని పొగుడుతూ; కృష్ణునితోకలసి ప్రయాణం చేస్తూ; కలసి కూర్చుంటూ; కలసి శయనిస్తూ; సాయుజ్యము పొందినట్లు ఉన్నారు. కృష్ణునితో ఈ బంధుత్వ మిత్రత్వాలు కలిగే భాగ్యం వీరికి ఎలా లభ్యము అయిందో?” అని ఆ రాజశ్రేష్ఠులంతా ఆశ్చర్యపడుతూ, శ్రీకృష్ణుడి దయవలన సిద్ధించిన సకల వైభవాలతో జీవిస్తున్న ఉగ్రసేనాది యదు వృష్ణి పుంగవులను ఆ రాజులు అందరూ అనేక సార్లు అభినందించారు. ఆ సమయంలో పాండురాజు పత్ని కుంతీదేవి.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=74&Padyam=1050 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




No comments: