Saturday, October 23, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౭౫(375)

( రాజసూయంబు నెఱవేర్చుట ) 

10.2-786-క.
దమఘోషసుతుఁడు దద్విభ
వము సూచి సహింప కలుక వట్రిలఁగా బీ
ఠము డిగ్గి నిలిచి నిజ హ
స్తము లెత్తి మనోభయంబు దక్కినవాఁడై.
10.2-787-వ.
అప్పు డప్పుండరీకాక్షుండు వినుచుండ సభాసదులం జూచి యిట్లనియె. 

భావము:
అంతలో, కృష్ణుని మేనత్త శ్రుతశ్రవస, చేది దేశ రాజు దమఘోషుల కుమారుడైన శిశుపాలుడు ఆ వైభవాన్ని చూసి ఓర్వలేకపోయాడు. అసూయతో మనసులోని భయాన్ని వీడి తన చేతులెత్తి ఆసనం దిగి, నిలబడి పుండరీకముల వంటి కన్నులతో అలరారుతున్న శ్రీకృష్ణుడు వినేలా సభాసదులతో ఇలా అన్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=59&Padyam=787 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments: