Saturday, October 16, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౬౮(368)

( రాజసూయంబు నెఱవేర్చుట ) 

10.2-768-ఆ.
కడఁగి సవనభూమిఁ గనకలాంగలముల
నర్థి దున్ని పాండవాగ్రజునకు
నచట దీక్షచేసి యంచితస్వర్ణ మ
యోపకరణముల నలోపముగను,
10.2-769-వ.
ఇట్లు నియమంబున సముచిత క్రియాకలాపంబులు నడపుచుండి రప్పుడు.
10.2-770-క.
సకలావనీశు లిచ్చిన
యకలంక సువర్ణరత్న హయ ధన వస్త్ర
ప్రకరంబులు మొదలగు కా
నుక లందుకొనన్ సుయోధనుని నియమించెన్. 

భావము:
పూని యజ్ఞభూమిని బంగారునాగళ్ళతో దున్నించి, సువర్ణమయమైన పరికారాలతో ఏలోపం రాకుండా పంచపాండవులలో పెద్దవాడైన ధర్మరాజుకు యజ్ఞదీక్ష ఇచ్చారు. అలా బ్రాహ్మణులు నియమం ప్రకారం ఉచితమైన కార్యకలాపాలు నడుపుతున్నారు. ఆ సమయంలో ధర్మరాజు సమస్తభూపతులూ తనకు సమర్పించే ధన, కనక, వస్తు, వాహనాదులైన కానుకలను స్వీకరించటానికి దుర్యోధనుడిని నియమించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=59&Padyam=770 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments: