Saturday, April 10, 2021

శ్రీకృష్ణ విజయము - 196

( ఇంద్రప్రస్థంబున కరుగుట)

10.2-110-మ.
"పట్టఁగ లేరు నిన్నుఁ దమభావము లందు సనందనాదు లే
పట్టుననైన, నట్టి గుణభద్రచరిత్రుఁడ వీవు, నేఁడు మా
చుట్టమ వంచు వచ్చెదవు; చూచెద వల్పులమైన మమ్ము; నే
మెట్టి తపంబు చేసితి మధీశ్వర! పూర్వశరీర వేళలన్?"
10.2-111-వ.
అని ధర్మజుండు దన్నుఁ బ్రార్థించిన నింద్రప్రస్థపురంబు వారలకు నయనానందంబు సేయుచు హరి గొన్ని నెలలు వసియించి యుండె; నందొక్కనాఁడు.

భావము:
“ప్రభూ! సనందాది మహర్షులే ఎంతో ప్రయత్నించి కూడా, నిన్ను తెలియలేరు. నీవు అంతటి సద్గుణ సచ్చరిత్రలు గల మహానుభవుడవు. ఇవాళ నీవు మా బంధువు అయ్యావు. అల్పుల మైన మమ్మల్ని చూడటానకి వచ్చావు. పూర్వజన్మలో మేము ఎంతటి తపస్సు చేసామో!" అని ఈవిధంగా ధర్మరాజు శ్రీకృష్ణుడుని స్తుతించాడు. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థంలోని ప్రజలకు నేత్రానందం కలిగిస్తూ అక్కడే కొన్ని నెలలపాటు ఉన్నాడు. అప్పుడు ఒకరోజు....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=14&Padyam=110

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: