Tuesday, September 30, 2014

తేనె సోనలు - గుడులు

గుడులు కట్టించె కంచర్ల గోపరాజు
రాగములు కూర్చె కాకర్ల త్యారాజు
పుణ్యకృతి చెప్పె బమ్మెర పోతరాజు
రాజులీ మువ్వురును భక్తిరాజ్యమునకు
- కరుణశ్రీ
          భక్తులు ఎందరో ఉన్నారు వారందరిలోను రాజులు (గొప్పవారు) అని చెప్పటానికి ముగ్గురే ఉన్నారట. ఒకరు కంచర్ల గోపరాజు. ఆయన గుళ్ళు కట్టించారు భద్రాచలంలో. ఇంకొకరు త్యాగరాజు. ఈయన సంగీతకృతులు కూర్చేరట. మరింకొరు పోతరాజు (బమ్మెర పోతనామాత్యుడు). ఈయన పుణ్య గ్రంధరచన చేసారట.
          అవును అవును కరుణశ్రీ మాట కలకాలం సత్యం, ఎవరు కా దనగలరు.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: