Monday, September 13, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౭(337)

( పాండవులు శ్రీకృష్ణునెదుర్కొనుట ) 

10.2-693-మ.
అని యిబ్భంగి సరోజలోచనలు సౌధాగ్రంబు లందుండి య
వ్వనజాతాక్షుని దివ్యమూర్తిఁ దమభావం బందుఁ గీలించి సం
జనితానంద రసాబ్ధిమగ్న లగుచున్ సంప్రీతిఁ దద్భవ్య కీ
ర్తనలై చల్లిరి నవ్యలాజములు మందారప్రసూనావలుల్‌. 

భావము:
అలా పొగడుతూ ఆ కలువ కన్నుల కోమలులు మేడలమీద నిలుచుండి, తామరరేకులవంటి కన్నులున్న శ్రీకృష్ణుడి దివ్యమంగళ విగ్రహాన్ని మనస్సులో నిలుపుకొన్నారు. దానితో కలిగిన ఆనంద సాగరంలో మునకలు వేస్తూ, సంతోషంతో అతనిపై కీర్తనులు పాడుతూ, మందారపుష్పాలూ, లాజలూ చల్లారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=54&Padyam=692 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: