Tuesday, June 9, 2020

ఉషా పరిణయం - 19

( చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట )

10.2-364-వ.
అని చెప్పి “యే నతిత్వరితగతిం జని యక్కుమారరత్నంబుఁ దొడ్కొనివచ్చు నంతకు సంతాపింపకుండు” మని యా క్షణంబ వియద్గమనంబునం జని ముందట.
10.2-365-క.
సరసిజముఖి గనుఁగొనె శుభ
భరిత విలోకన విధూత భవ వేదనముం
బరసాధనమును సుకృత
స్ఫురణాపాదనముఁ గృష్ణు పుటభేదనమున్.

భావము:
చిత్రరేఖ ఇలా చెప్పి, “నేను వెంటనే వేగంగా వెళ్ళి ఈ కుమారరత్నాన్ని తీసుకుని వస్తాను. అంతవరకూ నీవు విచారించకుండా ఉండు.” అని ఆ క్షణంలోనే ఆకాశమార్గాన బయలుదేరి ముందుకు వెళ్ళి ఆ చిత్రరేఖ అలా ఆకాశగమనంలో వెళ్ళి, ఇహలోక దుఃఖాన్ని పోగొట్టగలదీ, పరలోకాన్ని సాధించడానికి తోడ్పడగలదీ, పుణ్యాలపుట్ట అయిన శ్రీకృష్ణుడి పట్టణం ద్వారకను దర్శించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=34&padyam=365

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: