Saturday, August 4, 2018

శ్రీకృష్ణ లీలలు - ౫౫

10.1-386-వ.
అప్పు డా యవ్వయు గోపికలును వెఱంగుపడిరి; తదనంతరంబ
10.1-387-ఆ.
ఒడలఁ జెమట లెగయ నుత్తరీయము జాఱ
వీడి యున్న తుఱుము విరులు రాలఁ
గట్టరాని తన్నుఁ గట్టెద నని చింతఁ
గట్టుకొనిన తల్లిఁ గరుణఁ జూచి.

భావము:
ఆప్పుడు ఆ వింతను, పిల్లాణ్ణి చూసి యశోదా, గోపికలూ నివ్వెరపోయారు. పిమ్మట, పడుతున్న శ్రమకు యశోద శరీరమంతా చమటలు పట్టాయి. కొప్పు వదులైపోయి పువ్వులు రాలిపోయాయి. అలా కట్టటానికి శక్యంకాని తనను కట్టాలనే పట్టుదలతో తల్లి పడుతున్న తంటాలు చూసి నల్లనయ్య జాలి పడి......
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=54&padyam=387

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: