Thursday, August 9, 2018

శ్రీకృష్ణ లీలలు - 59

10.1-394-శా.
సంపన్నుం డొరుఁ గాన లేఁడు తనువున్సంసారమున్ నమ్మి హిం
సింపం జూచు దరిద్రుఁ డెత్తుబడి శుష్కీభూతుఁడై చిక్కి హిం
సింపం డన్యుల నాత్మకున్ సముల కాఁ జింతించు నట్లౌటఁ ద
త్సంపన్నాంధున కంజనంబు వినుమీ దారిద్ర్య మూహింపఁగన్."
10.1-395-వ.
అని గీతంబు వాడి తన మనంబున.

భావము:
ధనవంతుడు ఎవరినీ లెక్కచేయడు; తన ధనాన్నీ, శరీరాన్నీ, సంసారాన్నీ నమ్ముకుని ఇతరులను హింసించాలని చూస్తాడు; దరిద్రుడు దారిద్ర్యదేవతకు చిక్కి కష్టాలతో బక్కచిక్కినా ఇతరులను హింసించడు; వాళ్ళు కూడా తనలాంటివారే కదా అని భావిస్తాడు; ఇది లోకరీతి; విను, కనుక ధనమదాంధులైన వారికి దరిద్రమే చక్కని కళ్ళు తెరిపించే మందు అవుతుంది;" ఇలా గీతం పాడిన నారదుడు తన మనసులో . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=55&padyam=394

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: