Wednesday, August 22, 2018

శ్రీకృష్ణ లీలలు - 71

10.1-416-క.
"నందుని కొమరుఁడు వినుఁ డీ
సందున మును దూఱి ఱోలు సరి యడ్డముగా
ముందటి కీడ్చిన మద్దులు 
గ్రందుకొనం గూలె; జనులఁ గంటి మిరువురన్."
10.1-417-వ.
అని యిట్లు పలికిన బాలకాలాపంబులు విని మిథ్యారూపంబు లని కొందఱనిరి; కొందఱు నానావిధంబుల సందేహించిరి; అంత నందుండు వికసిత వదనారవిందుం డగుచుఁ బట్టి కట్లు విడిచెను; నట్టి యెడఁ దన తెఱం గెవ్వరు నెఱుంగకుండవలె నని ఠవరకుమారుండు.


భావము:
“నందుని కొడుకు అయినట్టి కృష్ణుడు ఈ చెట్ల సందులలోనుంచి ముందు తాను దూరాడు. వెనుక నున్న ఱోలు ఏమో అడ్డంతిరిగింది. గట్టిగా లాగాడు. అంతే! మద్ది చెట్లు ఫెళఫెళ మంటూ కూలిపోయాయి. ఇద్దరు వ్యక్తులు కనబడ్డారు.” ఇట్లా యాదవ బాలురు చెప్పగా, కొందరు అబద్ధాలాడుతున్నారు అన్నారు. మరి కొందరు మరికొన్ని విధాలుగా సందేహించారు. అప్పుడు నందుడు తన కుమారుడు బ్రతికి బయటపడి నందుకు సంతోషించాడు. అతడు ముందుకు వచ్చి కృష్ణునికి కట్టిన త్రాళ్ళు విప్పాడు. ఆ సమయంలో ఈ విషయం నుండి గోపకుల మనస్సులు మళ్ళించటానికి, లీలా వినోది, కపట మానవ బాలకుడు అయిన కృష్ణుడు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: