Thursday, August 9, 2018

శ్రీకృష్ణ లీలలు - 60

10.1-396-క.
కలవాని సుతుల మనుచును
గలకంఠులతోడఁ గూడి కానరు పరులం
గలలో నైనను; వీరికిఁ
గల క్రొవ్వడఁగించి బుధులఁ గలపుట యొప్పున్.
10.1-397-వ.
అని చింతించి విజ్ఞాన విశారదుండగు నారదుండు నలకూబర మణిగ్రీవులఁ జూచి "మీరలు స్త్రీమదాంధులరు గావున భూలోకంబున నర్జున తరువులై నూఱు దివ్యవర్షంబు లుండుం డటమీఁద గోవిందచరణారవింద పరిస్పందంబున


భావము:
"ఈ యక్షరాజు కుమారులు ధనవంతుని కొడుకులమని గర్వించి ఉన్నారు; పైగా ప్రేయసులతో కూడి ఉన్నారు. ఇక చెప్పేదేమి ఉంది. వీరికి కొవ్వు అణచి మళ్ళీ సత్పురుషులనుగా మార్చటం సముచితమైన పని." అని తన మనసులో ఆలోచించుకొని విశేషమైన జ్ఞానం కల నారదమహర్షి నలకూబర, మణికూబరులతో ఇలా అన్నాడు "మీరు స్త్రీఐశ్వర్యమదంతో కొట్టుకుంటున్నారు; కనుక భూమ్మీద వంద దివ్యసంవత్సరాల పాటు మద్దిచెట్లుగా పడి ఉండండి. ఆ తరువాత గోవిందుని పాదారవిందాల స్పర్శ లభించుటచేత;



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: