Tuesday, October 20, 2020

శ్రీ కృష్ణ విజయము - 59

( కంసుడు దుశ్శకునముల్గనుట )

10.1-1300-క.
ఆ రేయి గోపయుతులై
క్షీరాన్నముఁ గుడిచి రామకృష్ణులు మదిఁ గం
సారంభ మెఱిఁగి యిష్ట వి
హారంబుల నప్రమత్తులై యుండి రిటన్
10.1-1301-క.
తన పురికి రామకృష్ణులు
చనుదెంచి నిజానుచరులఁ జంపుటయు మహా
ధనువుఁ గదిసి విఱుచుటయును
విని కంసుఁడు నిద్రలేక విహ్వలమతియై.

భావము:
రామకృష్ణులు ఆ రాత్రి గోపకులతో కలసి పాలబువ్వ తిని కంసుడి ప్రయత్నాలన్నీ మనసున ఎరిగిన వారై, యథేచ్ఛా విహారాలలో ఆ నగరోపవనంలో జాగరూకతతో ఉండి గడిపారు. కంసుడు తన పట్టణానికి బలరామకృష్ణులు రావటమూ, తన అనుచరులను సంహరించడమూ, అంత గొప్ప ధనుస్సును విరిచివేయడమూ విన్నాడు. అతనికి నిద్రపట్టలేదు మనసు కలతబారింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=152&padyam=1301

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: