Thursday, October 15, 2020

శ్రీ కృష్ణ విజయము - 55

( కుబ్జననుగ్రహించుట )

10.1-1282-క.
కామిని తిగిచినఁ గృష్ణుఁడు
రాముని వీక్షించి నగుచు "రాజానన! మ
త్కామితముఁ దీర్చి పిదపన్
నీ మందిరమునకు వత్తు నే డలుగకుమీ!"
10.1-1283-వ.
అని వీడుకొలిపి కృష్ణుండు విపణిమార్గంబునం జనిచని తాంబూల మాలికాగంధంబులును బహువిధంబు లయిన కానుకలు పౌరు లిచ్చినఁ బరిగ్రహించుచు ధనుశ్శాల కరిగి యందు.

భావము:
ఆ మదవతి తనను అలా లాగగా కృష్ణుడు బలరాముడిని చూసి నవ్వి, ఆమెతో ఇలా అన్నాడు “ఓ చంద్రముఖీ! నేను వచ్చిన పని సాధించిన తరువాత నీ ఇంటికి వస్తాను. ఇప్పటికి కోపించబోకు.” కృష్ణుడు ఇలా అంటూ ఆమెను సాగనంపాడు. తరువాత బజారు వీధమ్మట వెళ్ళి వెళ్ళి, పురప్రజలు ఇచ్చిన తాంబూలాలు, పూలదండలు, చందనములు, ఇంకా అనేక రకాల కానుకలను స్వీకరిస్తూ ధనుశ్శాల దగ్గరకి వెళ్ళాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=148&padyam=1283

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: