Thursday, October 8, 2020

శ్రీ కృష్ణ విజయము - 51

( సుదాముని మాలలు గైకొనుట )

10.1-1272-క.
"నీ పాదకమల సేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయునుఁ
దాపసమందార! నాకు దయచేయఁ గదే!"
10.1-1273-వ.
అని వేఁడికొనిన నిచ్చి మఱియు మాధవుం డమ్మాలికునకు బలాయుః కాంతి కీర్తి సంపద లొసంగి వాని గృహంబు వెడలి రాజవీధిం జనిచని.

భావము:
తాపసులకు కల్పవృక్షం వంటివాడా! శ్రీకృష్ణా! కమలముల వంటి నీ పాదాల పరిచర్యను, నీ పాదాలు పూజించే భక్తులతో చెలిమినీ, సర్వ ప్రాణులమీద అపరిమితమైన దయనూ నాకు ప్రసాదించు. సుదాముడికి అలా వేడుకున్నవన్నీ శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు. ఆ పైన బలము, ఆయుష్షు, తేజస్సు, యశస్సు, సిరిసంపదలు కరుణించి వాడి ఇంటి నుండి బలరాముడుతో కలిసి బయలుదేరి రాజవీధమ్మట వెళ్తూ వెళ్తూ. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=147&padyam=1273

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: