Tuesday, October 20, 2020

శ్రీ కృష్ణ విజయము - 58

( విల్లు విరుచుట )

10.1-1288-ఉ.
"అద్దిర! రాచవిల్ విఱిచె నర్భకుఁ డింతయు శంకలేక నేఁ
డుద్దవిడిన్ సహింపఁ దగ దుగ్రతఁ బట్టుద" మంచుఁ గ్రుద్దులై
గ్రద్దన లేచి తద్ధనువు కావలివా రరుదేర వారి న
య్యిద్దఱుఁ గూడిఁబట్టి మడియించిరి కార్ముకఖండ హస్తులై.
10.1-1289-వ.
ఇట్లు రామకృష్ణులు మథురాపురంబున విహరించి వెడలి విడిదులకుం జని; రంత.

భావము:
ఆ ధనుస్సు కాపాలా కాస్తున్న వీరులు “ఆశ్చర్యం! ఏ మాత్రం సందేహించకుండా ఈ పిల్లాడు శౌర్యంతో ఇప్పుడు రాజుగారి ధనుస్సు గొబ్బున ఖండించాడు. ఇది సహింపరాని సాహస కార్యం. మనం పౌరుషం చూపి ఇతగాడి పని పట్టాలి” అంటూ కోపోద్రేకంతో చటుక్కున లేచి, అతడి మీదకి వచ్చారు. అంతట రామకృష్ణులు ఇద్దరూ కలిసి ఆ విరిగిన విల్లు ముక్కలను చేతులలోకి తీసుకుని, వారిని పట్టి కొట్టి మట్టుపెట్టారు. అలా బలరామకృష్ణులు మధురానగరంలో విహారం చేసారు. అక్కడ నుండి బయలుదేరి తాము విడిది దిగిన తావులకు వెళ్ళిపోయారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=149&padyam=1288

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: