Wednesday, May 29, 2019

కపిల దేవహూతి సంవాదం - 26:

3-901-క.
ఘన నాడీ పుంజమువల
నను రక్తము దానివలన నదులును జఠరం
బున నాకఁలియును దప్పియుఁ
ననయము నా రెంటివలన నబ్దులు పుట్టెన్.
3-902-క.
విను హృదయమువలనను మన
మును మనమునఁ దుహినకరుఁడు బుద్ధియుఁ జిత్తం
బున బ్రహ్మయు క్షేత్రజ్ఞుం
డును గలిగిరి యవ్విరాజుఁడుం బూరుషతన్.

భావము:
విరాట్పురుషుని నాడులవల్ల రక్తమూ, రక్తంవల్ల నదులూ, జఠరం వల్ల ఆకలిదప్పులూ, ఈ రెండింటివల్ల సముద్రాలు పుట్టాయి. విరాట్పురుషుని హృదయంవల్ల మనస్సూ, మనస్సువల్ల చంద్రుడూ, బుద్ధీ, చిత్తంవల్ల బ్రహ్మ, క్షేత్రజ్ఞుడు కలిగారు. ఇలా ఆ అండం నుండి సృష్టికారకుడైన పురుషుడు పుట్టాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=48&padyam=902

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: