Sunday, May 30, 2021

శ్రీకృష్ణ విజయము - 243

( పదాఱువేల కన్యల పరిణయం )

10.2-225-క.
ఆ రామలతో నెప్పుడుఁ
బోరాములు సాల నెఱపి పురుషోత్తముఁడున్
గారామునఁ దిరిగెను సౌ
ధారామ లతాసరోవిహారముల నృపా!
10.2-226-క.
ఏ దేవుఁడు జగముల ను
త్పాదించును మనుచుఁ జెఱుచుఁ బ్రాభవమున మ
ర్యాదారక్షణమునకై
యా దేవుం డట్లు మెఱసె యాదవులందున్.

భావము:
ఓ రాజా! పురుషోత్తముడు శ్రీకృష్ణుడు రాకపోకలతో స్నేహం ప్రదర్శిస్తూ, ఆ స్త్రీలతో ఇళ్ళలో, తోటలలో, క్రీడా కొలనులలో విహరించాడు. ప్రపంచాన్ని తన ప్రభావంతో సృష్టించి, పోషించి, అంతం చేసే ఆ పరమాత్ముడు, జగద్రక్షకుడై యాదవులలో శ్రీకృష్ణుడుగా అవతరించి ఈవిధంగా విరాజిల్లాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=24&Padyam=226

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: