Monday, May 17, 2021

శ్రీకృష్ణ విజయము - 230

( నరకాసురుని వధించుట )

10.2-199-శా.
"ఇల్లాలం గిటియైన కాలమున మున్నే నంచు ఘోషింతు వో!
తల్లీ! నిన్నుఁ దలంచి యైన నిచటం దన్నుం గృపం గావఁడే!
చెల్లంబో! తలఁ ద్రుంచె" నంచు నిల నాక్షేపించు చందంబునన్
ద్రెళ్లెం జప్పుడు గాఁగ భూమిసుతుఁ డుద్దీప్తాహవక్షోణిపై.
10.2-200-క.
"కంటిమి నరకుడు వడఁగా
మంటిమి నేఁ" డనుచు వెస నమర్త్యులు మునులున్
మింటం బువ్వులు గురియుచుఁ
బంటింపక పొగడి రోలిఁ బద్మదళాక్షున్.

భావము:
“అమ్మా! వరాహావతారంలో నేను విష్ణుమూర్తి ఇల్లాలి నని చాటిచెప్పేదానవు కదమ్మా. కనీసం నిన్ను చూసి అయినా దయచూపకుండా, అయ్యో! అయిపోయింది. ఇదిగో చూడు శ్రీకృష్ణుడు నాతల త్రుంచా”డని భూదేవిని అధిక్షేపిస్తున్నట్లుగా నరకాసరుడు యుద్ధభూమిలో నేలకూలాడు. “అమ్మయ్యా! నరకాసురుడి చావు కనులారా కన్నాము. ఇంక ఇవాళ మనం బ్రతికిపోయాము.” అని దేవతలూ, మునీంద్రులూ ఆకాశం నుండి వరుసగా పూలవర్షం కురిపిస్తూ పద్మాక్షుని స్తుతించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=21&Padyam=200

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :



No comments: