Saturday, May 29, 2021

శ్రీకృష్ణ విజయము - 241

( పదాఱువేల కన్యల పరిణయం )

10.2-221-క.
తరుణులు బెక్కం డ్రయినను
బురుషుఁడు మనలేఁడు సవతి పోరాటమునన్,
హరి యా పదాఱువేవురు
తరుణులతో సమత మనియె దక్షత్వమునన్.
10.2-222-శా.
ఎన్నే భంగుల యోగమార్గముల బ్రహ్మేంద్రాదు లీక్షించుచున్
మున్నే దేవునిఁ జూడఁగానక తుదిన్ మోహింతు; రా మేటి కే
విన్నాణంబుననో సతుల్‌ గృహిణులై విఖ్యాతి సేవించి ర
చ్ఛిన్నాలోకన హాస భాషణ రతిశ్లేషానురాగంబులన్.

భావము:
లోకంలో పురుషుడికి ఎక్కువ మంది భార్యలు ఉంటే సవతి పోరాటాలతో జీవించలేక సతమత మైపోతాడు. కానీ, శ్రీకృష్ణుడు పదహారువేలమంది తరుణుల పట్ల సరి సమాన భావాన్ని ప్రదర్శిస్తూ తన సామర్ధ్యంతో సుఖంగా జీవించాడు. బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు మొదలైన వారు యోగమార్గంలో విష్ణుమూర్తిని దర్శించాలని ఎన్నో రీతులుగా ప్రయత్నించి, సాధ్యం కాక చివరకు మాయామోహితులు అవుతారో, ఆ మహాత్ముడికి ఎంతో నేర్పుతోఆ స్త్రీలు ఇల్లాండ్రై; ఎడతెగని ఆత్మీయ చూపులతో, చిరు నవ్వులతో, సరస సంభాషణలతో, ఆలింగన క్రీడలతో, అనురాగాలతో ప్రఖ్యాతంగా సేవించుకున్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=24&Padyam=222

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: