Friday, May 21, 2021

శ్రీకృష్ణ విజయము - 233

( కన్యలంబదాఱువేలందెచ్చుట )

10.2-206-ఉ.
రాజకులావతంసుఁడు పరాజిత కంసుఁడు సొచ్చి కాంచె ఘో
రాజుల రాజులం బటుశరాహతి నొంచి ధరాతనూజుఁ డు
త్తేజిత శక్తిఁ దొల్లిఁ జెఱదెచ్చినవారిఁ బదాఱువేల ధా
త్రీజన మాన్యలన్ గుణవతీ వ్రతధన్యల రాజకన్యలన్.
10.2-207-మ.
కని రా రాజకుమారికల్‌ పరిమళత్కౌతూహలాక్రాంతలై
దనుజాధీశ చమూవిదారు నతమందారున్ శుభాకారు నూ
తనశృంగారు వికారదూరు సుగుణోదారున్ మృగీలోచనా
జన చేతోధనచోరు రత్నమకుటస్ఫారున్ మనోహారునిన్.

భావము:
కంసారి, యదుకులావతంసుడు అయిన శ్రీకృష్ణుడు ఆ రాజసౌధంలో, ఘోరమైన యుద్ధాలలో భూదేవి కొడుకు నరకుడు రాజులను శర పరంపరలతో ఓడించి, చెరపట్టి తెచ్చిన మాననీయులూ, గుణవతులూ అయిన పదహారువేలమంది రాజకన్యలను చూసాడు. ఆ రాజపుత్రికలు, రాక్షస సైన్యసంహారుడూ; ఆశ్రిత మందారుడూ; సుందరాకారుడూ; సుగుణాధారుడూ; మానినీమానస చోరుడూ; మనోహారుడూ; రత్నకిరీట ధరుడూ; అయిన శ్రీకృష్ణుడిని మిక్కిలి వికసించిన కుతూహలంతో చూశారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=22&Padyam=207

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: