Thursday, March 25, 2021

శ్రీకృష్ణ విజయము - 181

( సత్రాజితునకు మణి దిరిగి యిచ్చుట)

10.2-76-వ.
ఇట్లు హరి దన పరాక్రమంబున జాంబవతీదేవిం బరిగ్రహించి, రాజసభకు సత్రాజిత్తుం బిలిపించి, తద్వృత్తాంతం బంతయు నెఱిగించి, సత్రాజిత్తునకు మణి నిచ్చె; నతండును సిగ్గువడి మణిం బుచ్చుకొని పశ్చాత్తాపంబు నొందుచు, బలవద్విరోధంబునకు వెఱచుచు నింటికిఁ జని.
10.2-77-క.
"పాపాత్ముల పాపములం
బాపంగా నోపునట్టి పద్మాక్షునిపైఁ
బాపము గల దని నొడివిన
పాపాత్ముని పాపమునకుఁ బారము గలదే?

భావము:
ఈలాగున శ్రీకృష్ణుడు తన పరాక్రమంతో జాంబవతీదేవిని చేపట్టి, రాజసభకు సత్రాజిత్తును రప్పించి, జరిగిన విషయమంతా చెప్పి, మణిని అతనికి అప్పగించాడు. సత్రాజిత్తు సిగ్గుపడి మణిని తీసుకుని పశ్చాత్తాపం చెందాడు. బలవంతుడితో విరోధం వచ్చిందే అని భయపడుతూ ఇంటికి చేరాడు. “పాపాత్ములైన వారి పాపాలన్నిటినీ పోగొట్టగలిగిన వాడు అయిన ఆ పద్మాలవంటి కన్నులున్న శ్రీకృష్ణుడి మీదనే అపనిందవేశాను. ఈ నా పాపానికి అంతం ఉందా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=9&Padyam=77

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: