Monday, March 15, 2021

శ్రీకృష్ణ విజయము - 169

( రతీప్రద్యుమ్నులాగమనంబు )

10.2-42-వ.
అని కొడుకుం జూచి సంతోషించి కోడలిగుణంబులు కైవారంబు సేసి, వినోదించుచుండె; నంత ద్వారకానగరంబు ప్రజలు విని హర్షించి; రందు.
10.2-43-క.
సిరిపెనిమిటి పుత్త్రకుఁ డగు
మరుఁ గని హరిఁ జూచినట్ల మాతలు దమలోఁ
గరఁగుదు రఁట, పరకాంతలు
మరుఁ గని మోహాంధకార మగ్నలు గారే? "
10.2-44-వ.
అని చెప్పి శుకుం డిట్లనియె

భావము:
అంటూ రుక్మిణీదేవి తన కుమారుడిని చూసి ఎంతో ఆనందించింది. కోడలి సద్గుణాలను పొగుడుతూ, వేడుకలు చేయసాగింది. అంతట ఆ వార్త విని ద్వారకానగర వాసులు అందరూ ఎంతో సంతోషించారు. ప్రద్యుమ్నుడు శ్రీపతి కృష్ణుడి పుత్రుడు, పైగా స్వయంగా మన్మథుడు. అతడిని చూసిన తల్లులు శ్రీకృష్ణుడిని చూసినట్లే భావించి కరగిపోతారుట. ఇంక పరకాంతలు ఈ మన్మథుడిని చూసి మోహాంధకారంలో మునిగిపోరా?” అని చెప్పి శుకమహర్షి ఇంకా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=4&Padyam=43

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: