Wednesday, September 26, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 22

10.1-469-వ.
ఆ సమయంబున.
10.1-470-మ.
ఒక వన్యాజగరేంద్ర మల్లదె గిరీంద్రోత్సేధ మై దావ పా
వక కీలా పరుష ప్రచండతర నిశ్వాసంబుతో ఘోర వ
హ్ని కరాళాతత జిహ్వతోడ మనలన్ హింసింప నీక్షించుచున్
వికటంబై పడి సాగి యున్నది పురోవీధిం గనుంగొంటిరే?

భావము:
అలా అఘాసురుడు ఎదురు చూస్తూ పడి ఉన్న ఆ సమయంలో.... ఆ దారిన వస్తూ ఉన్న గోపబాలకులు కొండచిలువను చూసారు. “అదిగో అడవి కొండచిలువ పర్వతమంత పెద్ద శరీరంతో పడుకుని ఉంది చూసారా? అగ్నిజ్వాలలతో తీక్ష్ణమైన బుసలు భయంకరంగా కొడుతోంది చూడండి. దాని చాచిన నాలుకల నుండి అగ్నిజ్వాలలు రేగుతున్నాయి చూసారా? మనలను చంపేద్దాం అని మన దారి మధ్యలో అడ్డంగా పడుకుని ఉంది.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=66&padyam=470

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: