Sunday, September 23, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 19

10.1-463-వ.
అని పలికి శుకయోగీంద్రుండు మఱియు ని ట్లనియె.
10.1-464-క.
అమరు లమృతపానంబున
నమరిన వా రయ్యు నే నిశాటుని పంచ
త్వమునకు నెదుళ్ళు చూతురు
తము నమ్మక యట్టి యఘుఁడు దర్పోద్ధతుఁడై.


భావము:
ఇలా చెప్పి శుకయోగీంద్రుడు పరీక్షన్మహారాజుతో మరల ఇలా అన్నాడు. “ఇలా ఉండగా కొంతకాలానికి అఘాసరుడు అనే రాక్షసుడు బయలుదేరాడు. దేవతలు అమృతం త్రాగి మరణం లేని వారైనా, ఈ అఘాసురుడి పేరు చెబితే బెదిరి పోతారు. ఈ అఘాసురుడు ఎప్పుడు మరణిస్తాడా అని, వారు ఎదురుచేస్తూ ఉంటారు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: