Saturday, August 20, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౭(607)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1264-క.
“మానవనాయక! యీ యా
ఖ్యానముఁ జదివినను వినిన ఘనపుణ్యులు ని
త్యానంద సౌఖ్యములఁ బెం
పూనుదు రటమీఁద ముక్తి నొందుదు రెలమిన్!”
10.2-1265-వ.
అని చెప్పి శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె.
10.2-1266-క.
"జననాయక! యింకఁ బురా
తనవృత్తం బొకటి నీకుఁ దగ నెఱిఁగింతున్.
వినుము తపోమహిమలఁ జెం
దిన మునిజనములు సరస్వతీనది పొంతన్.

భావము:
ఈ వృకాసుర వృత్తాంతం వినిన పుణ్యాత్ములు నిత్యం సుఖసంతోషాలతో జీవిస్తూ తుదకు మోక్షం పొందుతారు. ఇలా ఈ ఉపాఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పి శుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడితో ఇంకా ఇలా అన్నాడు. “మహారాజా! నీకు ఇంకొక పురాతనగాథ చెబుతాను విను. పూర్వం తపోధనులైన మునులు ఎందరో సరస్వతీనదీ తీరంలో ఉండేవారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1266

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: