Friday, August 5, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౯౯(599)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1243-క.
అరుదుగ వెలువడి రుద్రుఁడు
గరుణ దలిర్పంగ వానికర మాత్మకరాం
బురుహమునఁ బట్టి "తెగువకుఁ
జొర వలవదు; మెచ్చు వచ్చె సుమహిత చరితా!
10.2-1244-క.
నీమదిఁ బొడమిన కోరిక
లేమైనను వేఁడు మిపుడ యిచ్చెద" ననినం
దా మనమున సంతసపడి
యా మనుజాశనుఁడు హరుపదాంబుజములకున్.

భావము:
పరమశివుడు ఆ అగ్ని గుండంలో నుండి వెలువడి దయతో ప్రత్యక్షము అయ్యాడు. వృకాసురుని చేతిని పట్టుకుని, “సాహసించకు. నీ తపస్సుకు మెచ్చుకున్నాను. నీ మనసులో ఎట్టి కోరికలున్నా కోరుకో. వెంటనే నెరవేరుస్తాను.” అని శివుడు అనగా, వృకాసురుడు ఎంతో సంతోషపడి, శంకరుని పాదాలపై పడ్డాడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1244

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: