Wednesday, June 16, 2021

శ్రీకృష్ణ విజయము - 260

( రుక్మిణిదేవి స్తుతించుట )

10.2-259-క.
ధరణీనాథులు దమతమ
వరవనితామందిరముల వసియించుచు గో
ఖర మార్జాలంబుల గతి
స్థిరబద్ధు లగుదురు నిన్నుఁ దెలియని కతనన్.
10.2-260-ఆ.
జలజనాభ! సకల జగ దంతరాత్మవై
నట్టి దేవ! నీ పదారవింద
యుగళి సానురాగయుక్తమై నా మదిఁ
గలుగునట్లు గాఁగఁ దలఁపు మనఘ!

భావము:
సర్వేశ్వరుడిని నిన్ను గుర్తించ లేని రాజులు తమ ప్రేయసీ మందిరాలలో నివసిస్తూ పశువులు లాగా, గాడిదలు లాగ, పిల్లులు లాగ స్థిరంగా బంధింపబడుతూ ఉంటారు. ఓ పద్మనాభా! సకల జగదంతర్యామివి అయిన నీ పాదపద్మాలమీద నా బుద్ధి నిరంతరం అనురాగంతో ప్రసరించేటట్లు అనుగ్రహించు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=26&Padyam=260

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: